5 మార్చి, 2012

కాంగో రాజధానిలో భారీ పేలుడు, 206 మంది మృతి

                                       Congo Blasts
బ్రాజ్జావిల్: కాంగో రాజధాని బ్రాజ్జావిల్‌లో మందుగుండు డిపోలో భారీ పేలుడు జరగడంతో ఆదివారం సుమారు 206 మంది మృతి చెందారు. దాదాపు పదిహేను వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ జీవిస్తున్న వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. దేశాధ్యక్షుడు డెనిస్ సస్సో ఎంగెస్సో సొంత ఇళ్లు కూడా మందు గుండు సామాగ్రి పేలిన జరిగిన డిపో పక్కనే ఉంది.

అయితే ప్రమాదం జరిగే సమయానికి ఆయన నగరంలోని మరో ప్రాంతంలో ఉన్నారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న చర్చి కూడా కూలిపోవడంతో శిథిలాల క్రింద చిక్కుకొని చాలామంది చనిపోయారు.

కామెంట్‌లు లేవు: