20 జూన్, 2012

రామ్ చరణ్-ఉపాసన హనీమూన్ @ వాటికన్ సిటీ




















తిరుమల వెంకన్నను దర్శించుకన్న అనంతరం రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హనీమూన్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు చెర్రీ. అయితే ఎక్కడికి వెళ్లింది మాత్రం చెప్పలేదు.

తాజాగా చరణ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ జంట హనీమూన్ కోసం ‘వాటికన్ సిటీ' వెళ్లారు. ఈ మేరకు తన ట్విట్టర్లో వాటికన్ సిటీ ఫోటో ట్వీట్ చేసి....‘‘మూడు రోజుల క్రితం తిరుపతిలో ఉన్నాం... ఇప్పుడు వాటికన్ సిటీలో ఉన్నాం. సెయింట్ పీటర్స్ చర్చ్ సందర్శించా. థాంక్స్ యు గాడ్'' అంటూ ట్వీట్ చేశాడు.

కొన్ని రోజుల క్రితం చరణ్ తన హనీమూన్ గురించి వెల్లడిస్తూ.... ట్రాఫిక్ గోల, షాపింగ్ డిస్ట్రబెన్స్ లేని చోటుకు వెలుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పుడు చెప్పిన విధంగానే భార్య ఉపాసనతో కలిసి వాటికన్ సిటీకి చేరాడు చెర్రీ. వాటికన్ సిటీ అనేది ఒక చిన్న దేశం. ప్రపంచ క్రైస్తవుల మతగురువు పోప్ ఇండేది ఇక్కడే. ఇదో ప్రపంచ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్.

మూడు రోజుల పాటు ఇక్కడ గడిపిన అనంతరం చరణ్ నేరుగా... హైదరాబాద్ చేరుకుని వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగులో పాల్గొన బోతున్నాడు. ఈ చిత్రానికి ‘చెర్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించ తలపెట్టిన యూనివర్సల్ మీడియా బ్యానర్ ఫై 'చెర్రీ' అనే టైటిల్ ఫిలిం చాంబర్లో నమోదైంది. దీనిని బట్టి ఈ సినిమాకు 'చెర్రీ' పేరును ఖరారు చేసినట్టు అర్ధం అవుతుంది.

కామెంట్‌లు లేవు: