రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు
చేసిన మనుషులు'ఆడియో మొన్న శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఆ రోజు ఈ పంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తాడని రూమర్ వచ్చింది. కొన్ని
మీడియా ఛానెల్స్ కూడా దీన్ని సపోర్టు చేస్తూ న్యూస్ లు ప్రసారం చేసాయి.
దాంతో పవన్ అబిమానులంతా ఆశించారు. పూరి తాజా చిత్రం కెమెరామెన్ గంగతో
రాంబాబులో పవన్ హీరోగా చేస్తున్నారు కాబట్టి వస్తాడని భావించారు. పవన్
అభిమానులు కూడా చాలా మంది ఈ పంక్షన్ కి హాజరయ్యారు.
అయితే పూరీ
..పవన్ ని ఆహ్వానించాడని కానీ పవన్ పూర్తిగా బిజీగా ఉండటంతో రాలేకపోవాడని
సమాచారం. గత మూడు రోజులుగా నైట్ ఎఫెక్టు లు ఫైట్ సీక్వెన్స్ లు షూట్
జరుగుతూండటంతో పవన్ రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా అప్పుటికే ఒక రోజు
ఫ్యాన్స్ విపరీతంగా సారధి స్టూడియోకు రావటంతో డిస్ట్రబ్ అయ్యి లేటైంది.
ఆడియో రోజు కూడా లేటైతే దాని ఎఫెక్టు చివరలో రిలీజ్ ముందు పడుతుందని
భావించిన పూరీ కూడా పట్టుబట్టలేదని తెలుస్తోంది.
సినిమా ఆడియో సీడీలు
సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. రిలయెన్స్
ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై.
లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో
శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు
ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్నూ ఆవిష్కరించారు.
రఘు
కుంచె మాట్లాడుతూ " అందరూ దేవుడు చేసిన మనుషులే. నేను మాత్రం పూరి చేసిన
మనిషిని. నాకు నారుపోసి, నీరు పెట్టింది పూరీనే. అతనికి ఫ్రెండ్గా పుట్టడం
నేను చేసుకున్న అదృష్టం. ఇందులోని పాటలు రాయడానికి భాస్కరభట్ల ఎంత
వేదనపడ్డాడో ప్రత్యక్షంగా చూశా. తప్పకుండా ఈ పాటలు అందర్నీ అలరిస్తాయి''
అని తెలిపారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి