17 ఫిబ్ర, 2012

కూల్‌డ్రింకును తాగెవారికి షాక్‌న్యూస్

పురుగుమందులున్నాయన్న భయంతో గతంలో కూల్‌డ్రింకులను కొంతకాలం దూరం పెట్టాం. మళ్లీ వేసవికాలమొచ్చేసరికి షరామామూలే. కానీ.. శీతల పానీయాలు ఖచ్చితంగా డేంజరస్సనడానికి మరో రీజన్‌ దొరికింది. చక్కెరపాళ్లు ఎక్కువగా వుండే కార్బొనేటెడ్ ఎలిమెంట్స్ వల్ల కూల్‌డ్రింక్స్‌ మనిషికి ప్రమాదం తెచ్చిపెడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. క్లోమ కాన్సర్‌కు దారితీసే ఇలాంటి కూల్‌డ్రింకులు.. వారానికి రెండుసార్లకు మించి తీసుకోకూడదట. సింగపూర్‌లో 14 ఏళ్లలో ఏకంగా 60 వేలమంది జనం ఈ కాన్సర్‌బారిన పడ్డట్టు తేలింది. శీతలపానీయాలను మోతాదుకుమించి వినియోగించే ఇండియాలో కూడా ఈ ప్రమాదం పొంచివుందట. సో.. సమ్మర్‌లో సేదదీరదామని కూల్‌డ్రింకును టచ్‌ చేసేవారందరికీ ఇదో షాక్‌న్యూస్. 

కామెంట్‌లు లేవు: